AP Politics: ఒక మంచి పర్సన్.. రాంగ్ ప్లేస్లో ఉన్నారు: వైఎస్ షర్మిల

Election Updates: YS Sharmila embarked on a bus trip... Here is the schedule
Election Updates: YS Sharmila embarked on a bus trip... Here is the schedule

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు దగ్గర మనిషి అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నారు. ‘ఆళ్లపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఆయన చెల్లిగా నేను అర్థం చేసుకోగలను. ఒక మంచి పర్సన్.. రాంగ్ ప్లేస్లో ఉన్నారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ వైకాపాలో చేరిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఆయనను కాదని, ముఖ్యమంత్రి జగన్ మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైకాపాకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే .. ‘ఇకపై వైఎస్ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా’ అంటూ ఆమె సమక్షంలో జనవరి 21న కాంగ్రెస్లో చేరారు. నెల తిరక్కుండానే ఆ పార్టీని వీడి తిరిగి వైకాపా గూటికి చేరారు.