AP Politics: జనసేన పార్టీకి జై కొట్టిన కొత్తపల్లి బ్రదర్స్..!

Election Updates: JanaSena announced Jana Sena star campaigners
Election Updates: JanaSena announced JanaSena star campaigners

రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇచ్చిన టీడీపీ మీద అలక వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మీద గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు వైకాపా ని విడిచి కొత్తపల్లి సుబ్బారెడ్డి ఆయన తమ్ముడు కొత్తపల్లి జానకిరామ్ జనసేన లో చేరబోతున్నారు. మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరబోతున్నారు.

ఈ నెలాఖరులోగా కొత్తపల్లి సుబ్బారాయుడు అలానే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జానకిరామ్ జనసేన లో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసిన కొత్తపల్లి సోదరులు వైకాపాలో చేరుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నర్సాపురం నుండి గెలిచారు. అందులో సుబ్బారాయుడు పాత్ర కీలకం.