AP Politics: ఇవాళ శ్రీసత్య సాయి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Election Updates: CM Jagan will visit the joint Kurnool district today
Election Updates: CM Jagan will visit the joint Kurnool district today

ఇవాళ సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటనకు వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌… పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.15కు గోరంట్ల మండలం పాల సముద్రం చేరుకోనున్న సీఎం జగన్…మూడు గంటల 10 నిమిషాలకు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకనున్నారు.

కాగా, శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్షపన్నులు,మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేశారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటు అయింది. అయితే.. వీటిని ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఈ తరుణంలోనే… మోదీ కి సిఎం జగన్ , గవర్నర్ అబ్ధుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు