AP Politics: శంఖారావం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

Election Updates: What about the container that went into Jagan's house? Why not check it: Nara Lokesh
Election Updates: What about the container that went into Jagan's house? Why not check it: Nara Lokesh

శంఖారావం సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. జగన్ పని అయిపోయిందని అన్నారు.

ఆ మాట తాను చెప్తుంది కాదని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారని అన్నారు. ఎన్నికలు ముందు 25 ఎంపీలని గెలిపిస్తే ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నట్లు చెప్పారు. ప్రజలు 31 మంది ఎంపీలను ఇస్తే ఆ ఎంపీలని కేసులు మాఫీ కోసం కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వెంట 31 మంది ఎంపీలలో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని అన్నారు.