AP Politics: నేడు ఏపీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

AP Politics: Prime Minister Narendra Modi will visit AP today
AP Politics: Prime Minister Narendra Modi will visit AP today

ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్షపన్నులు,మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేశారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటు అయింది.

అయితే.. వీటిని ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఈ తరుణంలోనే… మోదీ కి సిఎం జగన్ , గవర్నర్ అబ్ధుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు. అటు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు.