AP Politics: టీటీడీ కీలక నిర్ణయం.. వారి జీతాలు 15 వేలకు పెంపు

AP Politics: Big alert for Tirumala Srivari devotees.. Tickets released today
AP Politics: Big alert for Tirumala Srivari devotees.. Tickets released today

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది.

పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రూ. 30కోట్లతో గోగర్భం- ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలకమండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.