Thalliki Vandanam Funds విడుదలకు ముహూర్తం ఫిక్స్
AP Government ప్రతిష్ఠాత్మక Thalliki Vandanam పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జూలై 22 నుంచి రూ.13,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15,000 మంజూరు చేయగా, అందులో రూ.2,000ను పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించి, మిగిలిన రూ.13,000ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ జూలై 22 నుంచి 24 వరకు కొనసాగనుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

Fake Linksపై జాగ్రత్త.. అధికారుల హెచ్చరిక
Thalliki Vandanam పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులను పంపుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. “డబ్బులు పొందాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి” లేదా “ఈ App Install చేసుకోండి” అంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని సూచించారు.
అలాంటి లింక్లపై క్లిక్ చేస్తే మొబైల్, బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. OTP, ATM PIN, Aadhaar Number, Bank Account Details వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు స్పష్టం చేశారు.
సందేహాలుంటే ఎక్కడ సంప్రదించాలి?
Thalliki Vandanam పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం లేదా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం అధికారిక ప్రక్రియ ద్వారానే నగదు బదిలీ చేస్తుందని, మధ్యవర్తులను లేదా నకిలీ సందేశాలను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.






