Varanasi: ‘వారణాసి’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. అక్టోబర్ మొదటి వారానికే ప్యాకప్?

‘వారణాసి’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. అక్టోబర్ మొదటి వారానికే ప్యాకప్?
‘వారణాసి’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. అక్టోబర్ మొదటి వారానికే ప్యాకప్?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ Varanasi. ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, ఐమాక్స్ వెర్షన్‌కు అనుగుణంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

ఇక ‘వారణాసి’ షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం మొదటి నుంచీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ నెల మొత్తం షూటింగ్ కొనసాగించాల్సిన అవసరం లేకుండా, అక్టోబర్ మొదటి వారంలోనే మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఆ తర్వాత చిత్రబృందం పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది.

భారీ స్థాయి విజువల్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కీలకంగా ఉండనున్నాయి. అందుకే షూటింగ్‌ను ముందుగానే ముగించి, మిగిలిన సమయాన్ని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, డబ్బింగ్ తదితర పనులకు కేటాయించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇది నిజమైతే రాజమౌళి కెరీర్‌లో తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లలో ‘వారణాసి’ కూడా ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే షూటింగ్ పూర్తయ్యే తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.