దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ Varanasi. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్పై ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది.
ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘వారణాసి’కి సంబంధించిన మ్యూజిక్ కంపోజింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కథ, పాత్రలు, విజువల్స్కు తగ్గట్టుగా ప్రత్యేకమైన సౌండ్ను సిద్ధం చేసేందుకు కీరవాణి తన టీమ్తో కలిసి వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబును ఇప్పటివరకు చూడని సరికొత్త లార్జర్ ద్యాన్ లైఫ్ అవతార్లో రాజమౌళి చూపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో కీరవాణి అందించనున్న పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
ఇక ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్న నేపథ్యంలో.. మ్యూజిక్ పరంగా కీరవాణి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





