కేజ్రీవాల్ మీద దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ రోడ్ షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఢిల్లీలొని మోతీ నగర్ ఏరియాలో ఆయన రోడ్ షో చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఓపెన్ టాప్ వ్యాన్ లో ఉంది ఉత్తర ఢిల్లీ నియోజకవర్గం వారితో మాట్లాడుతున్న సమయంలో ఒక దుండగుడు వ్యాన్ మీదకి ఎక్కి ఆయన మీద దాడి చేశాడు. ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి దాడి చేయగా అతన్ని కేజ్రీవాల్ మద్దతు దారులు కిందకు లాగేసారు. దాడి చేసిన వ్యక్తిని సురేష్ గా గుర్తించారు పోలీసులు. ఇలాంటి ఘటనే 2014లో కూడా చోటు చేసుకుంది ఢిల్లీ దక్షినపురి ఏరియాలో మాట్ల్డుతున్న కేజ్రీవాల్ మీద ఇలాగే ఒక వ్యక్తి దాడి చేశాడు.