ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. అక్టోబర్ నెల మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురవబోతున్నట్లు వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో పాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో ఈ నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నట్లు తెలిపింది. బుధవారం నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలుకానుంది.

మరోవైపు తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం పైకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.