శాంసంగ్‌ మొబైల్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌

శాంసంగ్‌ మొబైల్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ మొబైల్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌ను అందించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 స్మార్ట్‌ఫోన్‌ ధరను సుమారు రూ. 6000 వరకు తగ్గించింది. కాగా ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ కొన్ని రోజులపాటు మాత్రమే ఉండనుంది. శాంసంగ్‌ గెలక్సీ ఎఫ్‌62ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లలోకి కంపెనీ రిలీజ్‌ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 రెండు రకాల వేరియంట్లలో లభించనుంది.

6జీబీ వేరియంట్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 అసలు ధర రూ. 23, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 17, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 8జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 25, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 19, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే సుమారు రూ. 2500 క్యాష్‌ బ్యాక్‌ను అందింనుంది. ఫ్లిప్‌కార్టులో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1000 తగ్గింపు లభిస్తోంది.