బోయపాటికి టెన్షన్‌..!

Boyapati Srinu Tension With Ram Charan Look After Rangasthalam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో సాలిడ్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. భారీ స్థాయిలో రంగస్థలం వసూళ్లు సాధిస్తుంది. ఓపెనింగ్స్‌తో పాటు లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ కూడా రికార్డులు నమోదు చేయడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే రామ్‌ చరణ్‌ తర్వాత చిత్ర దర్శకుడు అయిన బోయపాటి శ్రీనుకు టెన్షన్‌ మొదలై ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘జయ జానకి నాయక’ చిత్రం తర్వాత చరణ్‌తో బోయపాటి సినిమా మొదలు పెట్టాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే బోయపాటి మరింత జాగ్రత్తలు తీసుకుని చరణ్‌తో సినిమా తీయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఒక సినిమా విజయంను సాధిస్తే అంతకు మించిన విజయాన్ని అభిమానులు కోరుకుంటారు. ‘రంగస్థలం’ మించిన విజయాన్ని బోయపాటి ఇవ్వలేక పోయినా, కనీసం ఆ స్థాయి విజయాన్ని అయినా మెగా ఫ్యాన్స్‌కు అందిస్తాడేమో చూడాలి. యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌లోని కొత్త యాంగిల్‌ను చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు. రంగస్థలంలో రామ్‌ చరణ్‌ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అందుకే తన సినిమాలో కూడా చరణ్‌లోని నటన ప్రతిభను మొత్తం పిండేసుకోవాలని బోయపాటి భావిస్తున్నాడు. విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని, తప్పకుండా బోయపాటి దర్శకత్వంలో చరణ్‌ చేయబోతున్న సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. భరత్‌ అను నేను చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమైరా దస్తూర్‌ ఈ చిత్రంలోనూ నటించనుంది.