Breaking: నేడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

Breaking: Hearing on Chandrababu's regular bail petition today
Breaking: Hearing on Chandrababu's regular bail petition today

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. సిబిఎన్ ప్రోత్బలంతోనే సిమెన్స్ కంపెనీకి అధికారులు రూ. 330 కోట్లు విడుదల చేశారని ఏఏజి పోన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న వాదించారు.

ఆయనకు చాలా పలుకుబడి ఉందని, బెయిల్ ఇస్తే దర్యాప్తుపై తీవ్రప్రభావం ఉంటుందని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి ఇవాల్టికి విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. ఇటీవల చంద్రబాబు కుడికంటికి శాస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే.. ఆ వివరాలను మరియు చంద్రబాబు గుండెకు సంబంధించిన కొత్త సమస్యను కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు లాయర్లు. లాయర్లు తెలిపిన సమాచారం ప్రకారం చంద్రబాబు గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని, గుండె పరిమాణం పెరిగిందని, తద్వారా గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపింది. అందువలన చంద్రబాబుకు తగిన విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారంటూ లాయర్లు కోర్టుకు తెలిపారు.