దారుణం: తండ్రి పై కోపంతో కూతురు పై నిప్పు.. ఆపై మృతి

త‌మిళ‌నాడులో దారుణం చోటుచేసుకుంది. తండ్రి మీద ఉన్న కోపంతో ఇద్ద‌రు దుండ‌గులు అత‌ని 14 ఏండ్ల కూతురుపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అసలు విషయం ఏంటంటే.. వెల్లుపురం ప‌ట్ట‌ణ స‌మీపంలోని సిరిమదురాయ్ గ్రామానికి చెందిన కె.జ‌య‌బాల్‌, కే కుమార్ సోద‌రుల‌కు, నిందితుడు మురుగన్‌కు మ‌ధ్య ఒక ఎక‌రం భూమి విష‌య‌లో గొడవలు జరిగాయి. దీంతో తాజాగా మురుగ‌న్ స్నేహితుడు జ‌య‌బాల్ కిరాణ దుకాణానికి సిగ‌రెట్ కొనే వంక‌తో వెళ్లి దుకాణంలో ఉన్న జ‌య‌బాల్ కుమారుడు జ‌య‌రాజ్ పై దాడి చేశాడు.

అయితే ఇదే ఘట‌న‌పై జ‌య‌బాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన మురుగ‌న్ త‌న మ‌రో స్నేహితుడు క‌లియ‌పెరుమాల్‌తో క‌లిసి అదే రోజు సాయంత్రం ఇంటిబ‌య‌ట ఆడుకుంటున్న జ‌య‌బాల్ కూతురు జ‌య‌శ్రీపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఆ తర్వాత అక్క‌డి నుంచి పారిపోయాడు. కాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్ద‌రినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.