సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం

సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టాపూర్‌, భూంపల్లి గ్రామాల మధ్యలో.. రోడ్డుపక్కన ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కాగా, రామాయణ్‌ పేట నుంచి సిద్ధిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫైరింజన్‌ అధికారులతో సహయంతో.. నీటిని తోడుతున్నారు.

బావిలోతు సుమారు 15 నుంచి 20 గజాలుంటుందని స్థానికులు చెబుతున్నారు. బావిలోపలి నీటిని పూర్తిస్థాయిలో తోడేస్తే గానీ కారులో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గజఈత గాళ్లు, స్థానికులు కూడా సహయక చర్యల్లో పాల్గోన్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రమాద స్థలానికి చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.