Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ వైపు ముంచుకొస్తున్న 2019 ఎన్నికలు…ఇంకోవైపు కనపడని గెలుపు ఆశలు. దీంతో సీఎం చంద్రబాబుని ఎలా బద్నామ్ చేయాలా అని వైసీపీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో బాబు విదేశీ పర్యటన కూడా వారికి ఓ ఆయుధంలా కనిపిస్తోంది. అప్పటి కేసులు తర్వాత కాస్త సైలెంట్ అయిన వైసీపీ అనుకూల సోషల్ మళ్ళీ ఇప్పుడు పాత పంధాలోకి వచ్చేసింది.
బాబు ఇప్పుడు విదేశీ టూర్ కి వెళ్ళింది ముదురుతున్న అల్జీమర్స్ వ్యాధి చికిత్స కోసమని ప్రచారం మొదలు పెట్టింది. అప్పుడెప్పుడో నిరాహార దీక్ష తర్వాత హైదరాబాద్ లో చేయించుకుంటున్న వైద్య పరీక్షల ఫోటోలు జత చేసి బాబు అల్జీమర్స్ చికిత్స కోసం వచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. లేనిది ఉన్నట్టు వున్నది లేనట్టు చెప్పడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని ఇప్పటికే చాలా సార్లు రుజువు అయినా వైసీపీ అదే ఫార్ములా తో ముందుకు వెళ్లడం వల్ల అధికార పార్టీ కన్నా ఆ పార్టీకే ఎక్కువ నష్టం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు వైసీపీ నాయకులు ఏమి చెప్పినా నాన్నా పులి కథ గుర్తుకు రావడం ఖాయం.