ఆంధ్రప్రదేశ్ పాలన పై మండి పడుతున్న ‘మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’

ఆంధ్రప్రదేశ్ పాలన పై మండి పడుతున్న 'మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు'

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతుందా లేక కాలకేయ రాజ్యమా అంటూ నిలదీసారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఏమిటీ నిరంకుశత్వమంటూ నిలదీశారు. ఇది నాగరిక రాజ్యమా? కాలకేయ రాజ్యమా? అంటూ ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.

“వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
ఇంతకుముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు.