ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు

ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు

ఆంగ్ల బోధనపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని నిలదీశారు.

ఇప్పుడు లోకేష్‌ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొచ్చు.. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా అని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి గుర్తుచేశారు.