‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి చిరంజీవి ఫస్ట్ రివ్యూ

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి చిరంజీవి ఫస్ట్ రివ్యూ
Miss Shetty Mr Polishetty team with Chiranjeevi

తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను చిరంజీవి చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. వెంటనే చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలిపించి వారిని అభినందించారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి చూశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. జాతి రత్నాలు సినిమాకి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పొలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉన్న మనందరి ‘దేవసేన’ అనూష్క శెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అవడంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి 100 శాతం ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనడంలో సందేహం లేదు’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా, దర్శకుడు మహేష్ బాబు, సంగీత దర్శకుడు రథన్, ఇతర చిత్ర బృందానికి చిరంజీవి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.