కరోనా భయంతో కానిస్టేబుల్ ఆత్మహత్య…..

Lover Dead In Thadikal Village

కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. రాష్ట్రంలోని బెంగుళూరులో ఓ కానిస్టేబుల్ కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎంతో మనోవేదనకు గురయ్యాడు ఆ హెడ్ కానిస్టేబుల్. కోరనా రావడంతో  బెంగళూరులోని సీవీ రామన్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అతడిని తరలించడానికి ఓ ప్రత్యేక మినీ బస్సును కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ మినీ బస్సులోనే గమ్యానికి చేరేలోపే ఆత్మహత్య చేసుకోవడం ఇప్పడు సర్వత్రా కలకలం రేపుతోంది.

అయితే ఆస్పత్రి చేరుకున్న తర్వాత డ్రైవర్ బస్సు డోర్ ఓపెన్ చేసి చూడగా బస్సు గ్రిల్ కు అతడి లుంగీతో ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. కరోనా పాజిటివ్ గా తేలిందన్న భయంతోనే ఆ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడౌతుంది. కాగా కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంతో జయించగలమనే నమ్మకంతో చికిత్స చేయించుకోవాలని కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీస్ విభాగం అడిషనల్ డీజీపీ అలోక్ కుమార్ స్పష్టం చేశారు.