కరీంనగర్ వరకు విస్తరించిన మహమ్మారి

కరోనా పేరుతోకరీంనగర్ వరకు విస్తరించిన మహమ్మారి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

రాష్ట్రంలోని కరీంనగర్ లో మాత్రం ఒకేదగ్గర ఏకంగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరీంనగర్ లో 144 సెక్షన్ అమలు చేశారు. కాగా ఈ విరుస విభారిన పడ్డ వారందరు కూడా ఇండోనేషియా కి చెందిన వారుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తక్షణమే స్పందించిన ప్రభుత్వం వారందరిని కూడా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి అత్యవసరమైన చికిత్సను అందిస్తున్నారు.కాగా ఇటీవల కొందరు యువకులు ఇండోనేషియా నుండి కరీంనగర్ కి వచ్చారు. కాగా వీరందరూ కూడా రామగుండం, కరీంనగర్ ప్రాంతాల్లో తమ బస ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరిని కూడా పరీక్షించగా వారందరికీ కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా ఒకేసారి ఇంతమందికి ఈ వైరస్ సోకడంతో ఇంకెంతమందికి ఈ వైరస్ వ్యాపించింది అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి.