వెండి మాస్క్ లకు బారి డిమాండ్ ….స్వర్ణకారులకు చేతినిండా పని

వెండి మాస్క్ లకు బారి డిమాండ్ ....స్వర్ణకారులకు చేతినిండా పని

ఇప్పుడున్న ఈ కరోనా మహమ్మారి దెబ్బకు భారతదేశంలో వివాహాలు సాదాసీదాగా తక్కువ మంది అత్యంత భద్రతా చర్యలను తీసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివాహాలకు హాజరయ్యే అతిథులు పరిమిత సంఖ్యలో ఇప్పుడు ముసుగులు ధరించాలి. వేదిక వద్ద వారి చేతులను శానిటైజర్ తో శుభ్రపరచాలి.

ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా.. కర్ణాటకలోని కొన్ని సంపన్న కుటుంబాలు తమ వివాహాలు ఉత్సాహంగా అత్యంత భారీ ఖర్చుతో చేయడం ట్రెండింగ్ గా మారింది. పెళ్లిళ్లను అత్యంత భారీగా చేసుకునే ధనవంతులైన కన్నడిగులు వివాహాలలో తమ అతిథులకు రాచమర్యాదలు చేస్తుంటారు. అది వారి ఆనవాయితీ.. అతిథులకు సాధారణ బట్టతో చేసిన మాస్క్ లు కాకుండా వెండితో చేసిన డిజైనర్ మాస్క్ లను పంపిణీ చేయడం విశేషంగా మారింది.

మరి ఈ వెండి ముసుగు ధర దాదాపు రూ .2500 నుంచి 3000 రూపాయాల మధ్య ఉంటుంది. బెల్గావి.. చిక్కోడి వంటి నగరాల్లో ఈ వెండి మాస్క్ లకు అధిక డిమాండ్ ఉంది. ఈ కొత్త రకం మాస్క్ క్రేజ్కు జనాలు ఫిదా అవుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం కర్ణాటకలో ఎగబడుతున్నారు. దీంతో ఈ వెండి మాస్క్ తయారీదారులు.. స్వర్ణకారులకు చేతినిండా పనిదొరికింది. ఈ మాస్క్ లకు డిమాండ్ పెరిగిపోవడంతో వారు ఈ కష్టకాలంలో ఉపాధిని పొందుతున్నారు.