ఫామ్ కోల్పోయిన దేవిశ్రీ ప్రసాద్

ఫామ్ కోల్పోయిన దేవిశ్రీ ప్రసాద్

నిజమే ఇప్పుడు తమన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకుముందు అతడిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించిన దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ కోల్పోయాడు. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు తమన్‌నే ప్రిఫర్ చేస్తున్న మాట వాస్తవం. కానీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే కొత్త సినిమాకు ముందు సంగీత దర్శకుడిగా అనుకున్న దేవిశ్రీ ప్రసాద్‌ను తప్పించి తమన్‌ను తీసుకునే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తుండటం విడ్డూరం.

ఈ సినిమాకు తమన్‌ను తీసుకోవాలని బన్నీ సుక్కు దగ్గర పట్టుబడుతున్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం ఇది ఎంత మాత్రం నిజం కాదు. నూటికి నూరు శాతం ఈ సినిమాకు దేవిశ్రీనే సంగీతం అందించనున్నాడు. బన్నీ సుక్కును డిమాండ్ చేశాడన్న వార్త కేవలం ఊహాగానం మాత్రమే.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిని మార్చే అవకాశమే లేదు. ఎందుకంటే దీని కోసం దేవిశ్రీ ప్రసాద్ ఆరు నెలల కిందటే పని మొదలుపెట్టాడు. సుక్కు, దేవి కలిసి ఎన్నో రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశారు. మూణ్నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. తన సంగీతం గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో తనేంటో రుజువు చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. పైగా సుక్కు దేనికీ ఒక పట్టాన ఒప్పుకునే మనిషి కాదు. దేవి ఆయనకు క్లోజ్ ఫ్రెండే కానీ.. మ్యూజిక్ విషయంలో మాత్రం రాజీ పడే రకం కాదు.

మిగతా టెక్నీషియన్ల కంటే దేవిని ఎక్కువ సతాయిస్తాడు. బన్నీ సినిమా కోసం మరింతగా దేవిని కష్టపెట్టి మంచి ట్యూన్లే రాబట్టుకున్నాడని.. ఈ సినిమా పాటలు మరో స్థాయిలో ఉంటాయని చిత్ర బృందంలోని వాళ్లు అంటున్నారు. పాటలు కూడా రెడీ అయిపోయాక దేవిని మార్చి.. తాను ఇప్పటిదాకా పని చేయని తమన్‌ను సుక్కు పెట్టుకుంటాడని ఎలా అనుకుంటాం?