సీరియస్‌గా ఉన్న విరాట్‌ ధోని

సీరియస్‌గా ఉన్న విరాట్‌ ధోని

ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌ 2021లో భాగంగా నేడు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే షార్జాలో గాలి దుమారం కారణంగా టాస్‌ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. ఈ గ్యాప్‌లో విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని సీరియస్‌గా చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. ఫ్యాన్స్‌ మాత్రం మాకు తెలుసంటూ ట్విటర్‌లో కామెంట్స్‌ చేశారు.ఇక టి20 ప్రపంచకప్‌ 2021 దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఎంఎస్‌ ధోనిని మెంటార్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

మరోవైపు టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇప్పటినుంచే టి20 ప్రపంచకప్‌ ప్రణాళికలు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. వీరి సంభాషణలో ధోని ఎక్కువగా మాట్లాడుతుంటే కోహ్లి అతను చెప్పింది సీరియస్‌గా వింటున్నట్లు కనిపించింది. ఆ తర్వాత కోహ్లి టి20 ప్రపంచకప్‌ అనంతరం ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుంది. అంతేగాక కోహ్లి ఈ సీజన్‌ తర్వాత కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.