Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Dinakaran Homam for Enemity
తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో మూడు ముక్కలాట రక్తి కడుతోంది. రెండాకుల పార్టీలో మూడు వర్గాలు అధికార పీఠం కోసం సమరం చేస్తున్నాయి. పన్నీర్, పళని వర్గాలు ఒకటవుతున్నా.. దినకరన్ మాత్రం దింపుడు కళ్లెం ఆశలతో ఉన్నారు. ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఇప్పటికే స్లీపర్ సెల్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పుడు ఏకంగా యాగమంటూ హంగామా చేస్తున్నారు.
రెండ్రోజుల్లో విలీనం ఖాయమని పన్నీర్ ప్రకటించడంతో దినకరన్ తన ఉనికి కనుమరుగౌతుందని భయపడుతున్నారు. అందుకే తాడోపేడో తేల్చుకోవాడనికి రెడీ అయ్యారు. శశికళ ఆశీస్సులతో శత్రుసంహార యాగం చేస్తున్నారు. మూఢనమ్మకాల పిచ్చి ఎక్కువగా ఉండే తమిళనాడులో యాగం పేరుతో ఎమ్మెల్యేలలను హడలగొట్టాలని దినకరన్ స్కెచ్చేశారు.
అయితే దినకరన్ యాగంపై పళని వర్గం మండిపడుతోంది. ప్రభుత్వం తన చెప్పుచేతుల్లో ఉండాలని దినకరన్ యాగం సంకల్పించారని ఆరోపించింది. దినకరన్ ఆటలు దేవుడు సాగనివ్వడని, దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడని చెబుతోంది. అటు కేంద్రం కూడా దినకరన్ చర్యల్ని నిశితంగా గమనిస్తోంది. పరిస్థితి చేయి దాటితే రంగంలోకి దిగి దినకరన్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.