సెన్సిబుల్ కథలతో కమర్షియల్ సక్సెస్ సాధించిన క్రిష్

సెన్సిబుల్ కథలతో కమర్షియల్ సక్సెస్ సాధించిన క్రిష్

గమ్యం, వేదం చిత్రాలతో సినిమా రంగం లో చాల సెన్సిబుల్ కథలతో పాటుగా కమర్షియల్ సక్సెస్ కూడా రుచి చూసాడు దర్శకుడు క్రిష్. గమ్యం, వేదం చిత్రాలు మాత్రమే కాకుండా, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె చిత్రాలతో క్రిష్ దర్శకత్వ ప్రతిభని కనబరిచారు. కంచె చిత్రం ఆశించిన విజయం సాదించనప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. అయితే క్రిష్ గత సంవత్సరం ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు రెండు ప్లాప్ చిత్రాల తర్వాత చాల గ్యాప్ తీసుకున్నారు.

అయితే రాజకీయాల తో పాటుగా పవన్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. పింక్ రీమేక్ లో నటిస్తూనే, రాజకీయా సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పింక్ రీమేక్ తర్వాత పవన్ దర్శకుడు క్రిష్ సినిమా లో నటించనున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం ఉందని, దానికి తగ్గ కథ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా తో క్రిష్ కి పేరు బాగానే వచ్చే అవకాశం వుంది. ఆ చిత్రం తో క్రిష్ మళ్ళీ తన ఫామ్ ని కొనసాగించాలని ఆరాటపడుతున్నాడు.