ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన అనురాధ సీఎం జగన్ త్వరలోనే జైలుకెళ్ళడం పక్కా అని జోస్యం చెప్పారు. జగన్ ఎప్పుడు జైలుకెళ్తారా అని నలుగురు నేతలు కాచుకు కూర్చుని ఉన్నారని ఆమె అన్నారు.

అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా సీఎం కావాలని కలలు కంటున్నారని అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. అయితే శాసన మండలిని రద్దు చేసి అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల మంది ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని, సీఎం జగన్ రద్దుల రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతారని ఆమె ఎద్దేవా చేశారు. శాసనమండలి రద్దు చేశారని వైసీపీ నేతలు విర్రవిగుతున్నారని, మండలిలో 20 మంది బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారని తెలియచేశారు.