ఉత్తరప్రదేశ్‌లో మహిళా డాక్టరు హ‌త్య

ఉత్తరప్రదేశ్‌లో మహిళా డాక్టరు హ‌త్య

ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బుధ‌వారం ఉద‌యం వార‌ణాసిలోని మ‌హ‌మూర్‌గంజ్ ప్రాంతంలో ఒక మహిళా డాక్టరును ఆమె బావ అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. మృతురాలు, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలుగా పోలీసులు గుర్తింంచారు. వివరాలు.. కుటుంబ వివాదం నేపథ్యంలో సప్నను ఆమె బావ అనిల్ ద‌త్తా హ‌త్య చేశాడ‌ని ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు. అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స‌ప్నపై తాను ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌పాలై ఆమె మ‌ర‌ణించింద‌ని అనిల్ త‌న నేరం అంగీక‌రించారు.ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. నేను అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను చూసేందుకు తాను వెళ‌తుండ‌గా వ‌దిన త‌న‌ను చూసి పెద్దగా న‌వ్వుతూ న‌పుంస‌కుడంటూ నిందించింద‌ని వీడియో క్లిప్‌లో నిందితుడు అనిల్ చెబుతుండ‌టం గమనర్హం. ఆమె నన్ను, నా సోదరుడిని గతంలో కూడా నపుంస‌కులంటూ నిందించింద‌ని చెప్పుకొచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.