చెన్నై రైలెక్కిన మేహ్రీన్ కి మందుబాబు షాక్ !

Drunken man shock To Mehreen Pirzada In Train Journey

క్రిష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో తెలుగు తెర మీదకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమాల్లో బిజీ అయిపొయింది పంజాబీ ముద్దు గుమ్మ మెహ‌రీన్ కౌర్‌. తాజాగా గోపీచంద్ సరసన పంతం సినిమాలో నటించిన ఆమె నోటా చిత్రంతో త‌మిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. విజ‌య్ దేవ‌రకొండ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. రెండు బాషలలో ఈ చిత్రాన్ని తెరకి ఎక్కిస్తున్నారు అయితే హైదరబాద్ లో ఉన్న మేహరీన్ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం అత్యవసరంగా చెన్నై వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ అప్పటికప్పుడు ఫ్లైట్ టిక్కెట్ దొర‌క‌లేదు. టికెట్ దొరకక పోవడంతో రైల్లో వెళ్లేందుకు అంగీకరించిందట. సదరు నిర్మాత ఓ బెర్త్ బుక్ చేయించగా, తాను రైలు ఎక్కే సమయానికే పూటుగా తాగిన ఓ వ్యక్తి, తన బెర్త్ ను ఆక్రమించాడట.

అతన్ని చూసి భయంతో వణికిపోయిన మెహరీన్, అతన్ని కదపడం ఇష్టంలేక చాలాసేపు రైల్లో నిలబడే ఉందట. చివరకు భ‌యంతో నిర్మాత‌కు ఫోన్ చేసి విష‌యాన్ని వివ‌రించింద‌ట‌. ఆయన స్పందించి, ఓ కారులో తన మనుషులను పంపారట. వారు ముందు స్టేషన్లో మెహరీన్ ను రైలు నుంచి దించేసి, కారులో చెన్నైకి తీసుకెళ్లారట. ఈ విషయాన్ని వెల్లడించిన ‘నోటా’ బృందం, మెహరీన్ చాలా భయపడిపోయిందని చెప్పుకొచ్చారు. ఇటువంటి ఘటనలు సాధారణంగా మనం రైల్లో అనుభవించే ఉంటాం కానీ ఒక సెలెబ్రిటి ఎదుర్కుంది కాబట్టి ఈరోజు మనకి ఒక న్యూస్ అయ్యింది. ఇటువంటి విషయాల మీద సంబందిత అధికారులు కటినంగా వ్యవహరించాలి లేదా ఇటువంటి సమస్యలే ఎదురవుతాయి.