ఏడో సారి ఎమ్మెల్యే

ఏడో సారి ఎమ్మెల్యే

హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణా స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనను మంత్రివర్గం నంచి భర్తరఫ్ చేయడాన్ని అవమానంగా భావించిన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి జూన్‌ 12న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో హుజురాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. తనను ఎలాగైనా ఓడించి తీరాలన్న అధికార పార్టీ ప్రయత్నాలన్నింటినీ ఎదురించి నిలిచిన ఈటల రాజేందర్ 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో హుజురాబాద్‌లో విజయం సాధించి ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన విజయంతో తెలంగాణలో అసెంబ్లీలో బీజేపీ శాసనసభ్యుల సంఖ్య 3కి చేరింది.