ఎవరికీ చెప్పొద్దు అంటూ…అందరికీ చెప్పేశారే !

తెలుగులో నిర్మాతగా అత్యధిక సక్సెస్ లు అందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దిల్ రాజు ఉన్నాడని చెప్పక తప్పదు. కచ్చితమైన తన లెక్కలతో నిర్మాతగా అంచలంచలుగా ఎదిగి ఇవాళ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడిగా నిలిచాడు.

తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలిగిపోతున్న ఆ నిర్మాత సొంత సినిమాల ద్వారా భారీగా లాభాలు వచ్చినా ఇతరులు నిర్మించిన సినిమాల డిస్ట్రిబ్యూషన్ కారణంగా బాగా నష్టపోయానని చెబుతూ ఉంటాడు. అయితే దిల్ రాజు ఎంత పెద్ద నిర్మాత ఐనా కూడా చిన్న సినిమాలను వదల్లేదు. ఇన్నేళ్ల తన కెరీర్ లో చిన్న సినిమాలకు అండగా ఉంటూనే పెద్ద సినిమాలను తెరకెక్కించాడు దిల్ రాజు.

అయితే ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాని మొన్న పండుగ రోజు రిలీజ్ చేసాడు దిల్ రాజు. దిల్ రాజు చేతిలో పడింది అంటే విషయం ఉన్నట్టే. నిజంగా ‘ఎవ‌రికీ చెప్పొద్దు’ సినిమా టైటిల్ ని నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. వాళ్లు దాన్ని ప్రమోట్ కూడా చేయటం లేదు. చిన్న సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా జనాల్లోకి వెళ్తుంది. మరి ఈ నిర్మాతలు బాద్యత అంతా దిల్ రాజు మీదే వేసినట్టున్నారు.

మార్నింగ్ షో నుండే మంచి టాక్ వచ్చింది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, హీరోగా నటించిన రాకేషే సినిమాని నిర్మించాడు. అయితే రాకేష్ వర్రే డబ్బుతోపాటు మనసుపెట్టి చేసిన, తీసిన సినిమా ఇది. కులం గురించి, కుల పిచ్చి గురించి హుందాగా చక్కని మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. అయితే సైరా మానియా వలన కలెక్షన్స్ సంగతి మాట్లడకున్నా హీరోకి, డైరెక్టర్ కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పాలి. బాహుబలిలో చూసిన అతనేనా ఇతను అని ఎప్పుడో ఒక నిముషాన అనిపించక మానదు.