ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాద ఘటన

ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాద ఘటన

కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలతో తల్లి కూతురితో సహా ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని చింతలమానెపల్లి మండలం బూరపల్లిలో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన నక్కా రాజుకి భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మరోమారు ఘర్షణ జరగడంతో మహారాష్ట్రలోని పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురితో సహా వెళ్లిన భార్య ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

భార్యబిడ్డలు నదిలో దూకిన విషయం తెలుసుకున్న భర్త మనస్థాపంతో ఇంటి సమీపంలోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. రాజు దంపతులకి ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.