నితిన్‌కు బ్రేక్‌ ఇవ్వబోతున్న దిల్‌రాజు

Finally producer DIL Raju fixed Nitin as hero in Srinivasa Kalyanam.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పలానా దర్శకుడితో సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని ఇంతకు ముందు అనుకునేవారు. కాని ఇప్పుడు టాలీవుడ్‌లో దిల్‌రాజు బ్యానర్‌లో ఒక్క సినిమా చేసినా కూడా మంచి పేరు వస్తుందని, స్టార్‌ ఇమేజ్‌ వస్తుందని యువ హీరోలు భావిస్తున్నారు. దిల్‌రాజు బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు యువ హీరోలు ఎంతో ఆసక్తి చూపుతారు. దిల్‌రాజు బ్యానర్‌ నుండి పిలుపు వచ్చిందంటే చేస్తున్న సినిమాలు లేదా కమిట్‌ అయిన సినిమాలను కూడా పక్కకు పెట్టి వెళ్లేందుకు యువ హీరోలు సిద్దంగా ఉంటారు. దిల్‌రాజు మంచి సినిమాలు చేస్తాడనే బ్రాండ్‌ క్రియేట్‌ అవ్వడంతో పాటు యువ హీరోలకు ఎంతో మందికి దిల్‌రాజు బ్రేక్‌ ఇచ్చాడు అనే ముద్ర పడిపోయింది.

nithin

తాజాగా యువ హీరో నితిన్‌ కూడా దిల్‌రాజుపై నమ్మకం పెట్టుకున్నాడు. అయితే ఇతర హీరోలు దిల్‌రాజు బ్యానర్‌లో ఒక్క ఛాన్స్‌ వస్తే బాగుండు అని కోరుకుంటుంటే, నితిన్‌కు మాత్రం ఒకే సారి రెండు చిత్రాలను దిల్‌రాజు బ్యానర్‌లో చేసే అవకాశం దక్కింది. దిల్‌రాజు, సతీష్‌ వేగేశ్నల కాంబినేషన్‌లో వచ్చిన ‘శతమానంభవతి’ భారీ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఆ సినిమాతో శర్వానంద్‌ స్టార్‌ అయ్యాడు. ఆ సినిమా తర్వాత వీరి కాంబోలో శ్రీనివాస కళ్యాణం అనే చిత్రం తెరకెక్కబోతుంది.

nithin-and-dilraju

శ్రీనివాసకళ్యాణంలో హీరోగా ఎన్టీఆర్‌ నటిస్తాడని, మెగా హీరోల్లో ఒకరు నటించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కాని తాజాగా నితిన్‌తో ఆ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేందుకు దిల్‌రాజు సిద్దం అయ్యాడు. ఇప్పటికే సతీష్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక రాజా ది గ్రేట్‌ చిత్రాన్ని చేసిన దర్శకుడు అనీల్‌ రావిపూడితో ఒక మల్టీస్టారర్‌ నిర్మించబోతున్నాడు దిల్‌రాజు. ఇప్పటికే ఆ సినిమాకు ‘ఎఫ్‌ 2’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ సినిమాలో ఒక హీరోగా నితిన్‌ నటించబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి నితిన్‌ వచ్చే సంవత్సరం రెండు సినిమాలతో సక్సెస్‌లను దక్కించుకోబోతున్నాడన్నమాట.