ఒక్క సారిగా బస్సు లో చెలరేగిన మంటలు

ఒక్క సారిగా బస్సు లో చెలరేగిన మంటలు

జాతీయ రహదారుల మీద ఎన్నో బస్సు ప్రమాదాలను గురించి మనం వింటూనే ఉంటాం.ఇప్పుడు అలాంటి ఒక షాకింగ్ సంఘటనే తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది.ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సుకు రామచంద్రాపురం ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.దీనిని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి పక్కనే ఒక హెచ్ ఫై పెట్రోల్ బంకు దగ్గరే తప్పని సరి పరిస్థితుల్లో ఆపేసి ప్రయాణికులను వెను వెంటనే దింపేసాడు.దీనితో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అంతా బయటపడ్డారు.

అయితే అంతా హుటాహుటిన బయటకు వస్తున్నప్పటికే బస్సులో మంటలు చెలరేగిపోయాయి.దీనితో అంతా దిగి బయటకొచ్చి చూస్తుండగానే వారి కళ్ళ ముందే మొత్తం బస్సు కాలిపోయింది.దీనితో సమాచారం అందుకున్న అగ్నిమాపక పోలీసులు అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చి కేసును దర్యాప్తు చేసారు.ఈ ప్రమదాహములో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది.డ్రైవర్ త్వరగా అప్రమత్తం కావడంతో అంతమందినీ ఒక్క గాయం కూడా కాకుండా కాపాడగలిగారు.