మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం….

మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం...
మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కు వెళ్ళే మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలులో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.
సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు సూఫర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు భద్రాచలం రైల్వేస్టేషన్ లో నిలిచిన సమయంలో ఎ1, బి1 ఏసీ బోగీల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ బోగీల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణీకులు బోగీ నుండి వెంటనే కిందకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా రైల్వేస్టేషన్‌లో దట్టమైన పొగ అలుముకొంది.