మాజీ ఎం.పి శివ ప్రసాద్ కన్నుమూత

మాజీ ఎం.పి శివ ప్రసాద్ కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు – చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు.. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన  తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఇటీవలే చెన్నైకి తరలించారు.  చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈసాయంత్రం తుదిశ్వాస విడిచారు..

గడిచిన 24 గంటలుగా  ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది. అంపశయ్యపై ఉన్న ఆయనను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చెన్నైకి బయలు దేరారు. అంతలోనే ఆయన మరణించడం టీడీపీ శ్రేణులను కలిచివేసింది.

2009 – 2014లో చిత్తూరు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ తనదైన ముద్ర వేశారు. పార్లమెంట్ లో వివిధ వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. సమైక్య ఆంధ్రా ఉద్యమం – ఆ తర్వాత టీడీపీకి అన్యాయాలపై పార్లమెంట్ లోనే సినిమా వేశాలు వేస్తూ మీడియాల్లో పతాక శీర్షిక అయ్యారు.

కాగా కొద్దిరోజులుగా శివప్రసాద్ మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. రెండు వారాల పాటు చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జి అయిన శివప్రసాద్ కు మరోసారి మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం చెన్నైకి తీసుకెళ్లి అత్యవసర చికిత్స విభాగంలో చేర్చారు.

.