పెళ్లి చేసుకోమంటున్నాడని తగలబెట్టిన బాలిక

తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న యువకుడికి ఎవరూ ఊహించిన షాక్ ఇచ్చిందో బాలిక. ఎంతకీ మాట వినని అతనికి బుద్ధి చెబుదామని తనను పెళ్లి చేసుకోవాలంటూ పెట్రోల్ పోసుకుని బెదిరించిన యువకుడికి ఆ అమ్మాయి నిప్పంటించింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 60శాతం కాలిన గాయాలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖాద్రాలో జరిగిన ఈ ఘటన యువకుడి తల్లి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన సమాచారం అరవింద్ నిషాన్ అనే యువకుడు తమ ఇంటి పక్కనే ఉండే తొమ్మిదో తరగతి బాలికను ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు కూడా తెలిపాడు. బాలిక తల్లిదండ్రులు మొదట చదువుకోమని ఆ తర్వాత పెళ్లి చేస్తామని నచ్చజెప్పారు. అయినా సరే మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ బాలిక వెంటపడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని వచ్చాడు. దీంతో నిషాద్‌కు బుద్ధి చెబుదామని ఆ బాలిక అగ్గిపుల్ల గీసి అతనిపై విసిరేసింది. ప్రస్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం తల్లీకూతుళ్లు అక్కడి నుంచి పారిపోయారని నిషాద్ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నిషాద్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.