బంగారం కొనుగోలుదారులకి శుభవార్త

బంగారం కొనుగోలుదారులకి శుభవార్త

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బంగారు నెక్లెస్ కొనుగోలు చేయాలని భావించే వారికి తగ్గింపు లభిస్తోంది. పండుగ ముందు బంగారం కొనే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు.

కల్యాణ్ జువెలర్స్‌కు చెందిన క్యాండెరే బ్రాండ్ అదిరే ఆఫర్లు అందిస్తోంది. నాభన్ నివారా లప్పా గోల్డ్ నెక్లెస్‌పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. తయారీ చార్జీల్లో 55 శాతం తగ్గింపుఅందిస్తోంది. దీంతో రూ.9200 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ నెక్లెస్ అసలు ధర రూ.54,773. అయితే ఆఫర్‌లో భాగంగా దీన్ని రూ.45,562కు కొనొచ్చు. అంటే తయారీ చార్జీల్లో 55 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని కోసం కొనుగోలు సమయంలో త్యోహర్ అనే కూపర్ ఉపయోగించాలి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ధర విషయానికి వస్తే.. మెటల్ ధర రూ.36,918గా ఉంది. తయారీ చార్జీలు రూ.7317. ఇక జీఎస్‌టీ రూ.1327. ఇది 22 క్యారెట్ల బంగారం నెక్లెస్. దీని బరువు 8.13 గ్రాములు. ఆన్‌లైన్‌లో మాత్రమే దీన్ని కొనగలం. మీరు మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా డెలివరీ సదుపాయం ఉందో లేదో తెలుసుకోవచ్చు.