ఇంజన్ నుంచి విడిపోయిన బోగీలు

ఇంజన్ నుంచి విడిపోయిన బోగీలు

వేగంగా వెళ్తున్న రైలు ఇంజిన్, బోగీలు విడిపోయి వెళ్లిపోయిన ఘటనలు చూశాం. ఇంజన్ నుంచి విడిపోవడంతో బోగీలు నిర్మానుష్య ప్రాంతంలో నిలిచిపోయిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అయితే గూడ్స్ రైలుకి. వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి వెనక ఉన్న కంటైనర్లు విడిపోయిన ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.

నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కామారెడ్డి రైల్వే గేటు వద్దకు వచ్చే సరికి బోగీలకు ఉన్న లింకులు ఊడిపోయాయి. దీంతో ఇంజిన్‌తో కొన్ని బోగీలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలును నిలిపివేసి మరమ్మతులు నిర్వహించారు. సుమారు అరగంట సేపు రైలు నిలిచిపోయింది. గూడ్స్ బోగీలు విడిపోయిన ఘటనను అధికారులు, సిబ్బంది వెంటనే గుర్తించి స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.