గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు కోవిడ్-19తో.. మృతి

గుజరాత్ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుడు కరోనాతో మృతి చెందడం సర్వత్రా కలకలం రేపుతోంది. క‌రోనా వైర‌స్‌తో పోరాడిన‌ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేట‌ర్ బ‌ద్రుద్దీన్ షేక్ ఆదివారం క‌న్ను మూశారు. అత‌నికి క‌రోనా సోక‌డంతో ఎనిమిది రోజుల క్రితం అహ్మ‌దాబాద్‌లోని ఎస్‌వీపీ ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

అయితే తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం మ‌ర‌ణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా అత‌ను పేద ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసే క్ర‌మంలో వైర‌స్‌ బారిన ప‌డ్డార‌ని గుజ‌రాత్ కాంగ్రెస్ నాయ‌కుడు శ‌క్తిసిన్హ గోహిల్ వెల్లడించారు. అత‌ని మ‌ర‌ణం కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోట‌ని పేర్కొంటూ ట్విట‌ర్ వేదిక‌గా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉంటూ స్థానిక అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని వెల్లడించారు. అయితే భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా పాజిటివ్‌ కేసులు 26,917 కు చేరుకోగా.. 826 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వివరించింది.