మరోసారి అమెరికాలో కలకలం సృష్టిస్తున్న కాల్పులు

మరోసారి అమెరికాలో కలకలం సృష్టిస్తున్న కాల్పులు

మరోసారి అమెరికాలో జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. రాజధాని అయిన వాషింగ్టన్ డీసీ వీధుల్లో గురువారం రాత్రి దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్కడ జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని సమీపo లో ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన వైట్‌హౌస్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో జరిగింది.