దొంగతనానికి వచ్చి ఆపై.. మహిళపై లైంగిక దాడికి దిగాడు

Gang rape with wife in betting on gambling, again and again!

లాక్ డౌన్ సమయంలో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఘోరానికి ఒడిగట్టాడు. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రిస్తున్న మహిళపై ఏకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు అతడ్ని గుర్తించారు. అజ్ఞాతంలో ఉన్న ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్‌కు వచ్చే వారి పర్సులు కొట్టేయడం, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడడం చేస్తున్నారు. ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అలాగే.. మోటార్‌ సైకిళ్ల చోరీలు కూడా బాగా జరుగుతున్నాయి.

అదేవిధంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఇళ్లలో నుంచి జనం బయటకు రావడం లేదు. ఇళ్ల ముందు ఉంచిన వాహనాలు ఎత్తుకు పోతున్నారు. అలాగే.. అనేక కార్యాలయాలు సంస్థల వద్ద పార్క్‌ చేసిన వాహనాలు మాయం అవుతున్నాయి. ఈ కేసుల విచారణలు పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఇలాంటి సమయంలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ మహిళపై లైంగిక దాడికి పాల్పడడం అన్నానగర్, తిరుమంగళం ప్రాంతాల్లో చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగిందంటే.. అన్నాగనర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి ఓ యువకుడు చల్లగా దూరాడు. అతడు అలా రావడాన్ని స్థానికులు గుర్తించి.. కేకలు పెట్టడంతో అతడు పారిపోయాడు. తాను వేసిన పథకం బెడిసి కొట్టడంతో ఆగ్రహంతో తిరుమంగళం వైపు ఓ నాలుగు అంతస్తుల భవనంలోకి ఆ యువకుడు దూరాడు. అక్కడ పై అంతస్తు డాబాపై ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అక్కడ నుంచి పారిపోయాడు. ఆమె పెట్టిన కేకలతో చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న అన్నాగనర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను చూసి ఆ యువకుడు అమింజికరైకు చెందిన వేల్‌మురుగన్‌ కుమారుడు రామకృష్ణన్‌గా తేల్చారు. చోరీ కేసులో అరెస్టై.. లాక్‌డౌన్‌ పుణ్యమా అని బయటకు వచ్చాడు. జైలు నుంచి అలా వచ్చాడో లేదో… దొంగతనానికి ప్రయత్నించి, చివరకు ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు దొరికాడంటే సామిరంగ పోలీసుల కసి తీరినట్టే.