బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాపై మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతుంది. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొడుతుంది.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఓవ‌ర్‌సీస్‌లో సినిమా రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతుందని, యు.ఎస్‌లో ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు $3,420,402 (24 కోట్లు సుమారుగా) వ‌సూళ్ల‌ను సాధించినట్టు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే మహేష్ బాబు హీరోగా చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమా పేరిట ఉన్న ఓవ‌ర్‌సీస్ నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను ఈ సినిమా ద్వారా బన్నీ అధిగ‌మించి నాలుగో స్థానంలో నిలిచిన‌ట్లు టాక్. అయితే బాహుబ‌లి 2, బాహుబ‌లి ది బిగినింగ్‌, రంగ‌స్థ‌లం చిత్రాల అల వైకుంఠ‌పుర‌ములో సినిమా నాల్గవ స్థానంలో నిలిచింది.