అలిగి వెళ్లిన భర్త… బావిలో ఎముకల గూడగా దొరికాడు….

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఘోరం జరిగింది. అదృశ్యమైన వ్యక్తి బావిలో ఎముకల గూడుగా కనిపించారు. రామనాథపురం, కముది మండల మాణిక్యం సమీపం వల్లండైకి చెందిన వ్యక్తి తిరుజ్నానానికి భార్య ముత్తురాక్క ఉంది. దీంతో తిరుజ్ఞానం తరచూ గొడవ పడి ఇంటి నుంచి అలిగి వెళ్లిపోతూ ఉండేవాడు.

అయితే ఈ క్రమంలో అప్పడప్పుడు అలా వెళ్లి రెండు నెలల తర్వాత తిరిగి వస్తూ ఉండేవాడు. అయితే అంతా ఈసారి కూడా అలా వెళ్లారని భావించారు. అయితే గత 9 నెలలకు ముందు ఇంటి నుండి వెళ్లిపోయిన తిరుజ్ఞానం తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ముత్తురాక్క భర్త కోసం అన్ని చోట్ల గాలింపు చేపట్టింది. అతని ఆచూకీ తెలియక పోవడంతో భర్త కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మధ్య వల్లలాంలోని ఊరికి చివర ఉన్న ఓ బావిలో చేతిలో సెల్‌ఫోన్‌లో ఎముకల గూడు ఒకటి బావిలో పడి వుండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎముకల గూడుని పైకి తీసి సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ చేయగా అది అదృశ్యమైన తిరుజ్ఞానం మృతదేహమని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఎముకల గూటిని ఫోరెన్సిక్‌ పరిశోధనకు పంపి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.