వేశ్యతో లవ్…ప్రియుడి స్నేహితుడితో అక్రమ సంబందం….మర్డర్ !

illicit-relationship-with-boyfriends-friend-murder

వేశ్యతో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. దుబాయిలో మొదలైన స్నేహం ఓ వేశ్య కోసం ఘర్షణ పడి ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపింది. మొగల్తూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి కొన్నాళ్లు ఉండి వచ్చాడు.

అతడితో పాటు అక్కడ పనిచేసిన దువ్వ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. స్వదేశానికి వచ్చిన తర్వాత శివరామకృష్ణకు వ్యభిచార వృత్తి కొనసాగిస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ఓ ఇంట్లో ఉంచి సహజీవనం కొనసాగిస్తున్నాడు.

గల్ఫ్‌లో ఏర్పడిన పరిచయంతో శివరామకృష్ణ ఇంటికి బాలాజీ తరుచూ వస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ యువతితో బాలాజీకి అక్రమ సంబంధం ఏర్పడింది. శివరామకృష్ణ గ్రామంలో లేని సమయంలో యువతి, బాలాజీకి ఏకాంతంగా కలుసుకునేవారు. కొంతకాలం పాటు సాగిన వారి అక్రమ సంబంధం శివరామకృష్ణ తెలియడంతో ఆ యువతిని ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు పంపేశాడు. ఆమె అక్కడికి వెళ్లినా బాలాజీతో ఫోన్లో మాట్లాడేది.

ఈ విషయం తెలుసుకున్న శివరామకృష్ణ బాలాజీని హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. దీంతో బాలాజీని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి మందు పార్టీ చేసుకుందామంటూ బాలాజీని ఆహ్వానించాడు శివరామకృష్ణ. వీరిద్దరూ దువ్వలోని ఓ వైన్‌షాపుకు వెళ్లి ఫుల్లుగా మద్యం తాగారు.

తనతో సహజీవనం చేస్తున్న యువతిని మరిచిపోవాలని శివరామకృష్ణ బాలాజీని హెచ్చరించాడు. బాలాజీ ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో దుబాయ్‌ నుంచి ఆ యువతి బాలాజీకి ఫోన్ చేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శివరామకృష్ణ కత్తితో స్నేహితుడి పీక కోసి పరారయ్యాడు. తీవ్రరక్తస్రావంతో బాలాజీ వైన్‌షాప్ ఆవరణలో ప్రాణాలు కోల్పోయాడు.