నేను వేరు అమ్మ వేరు

నేను వేరు అమ్మ వేరు

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా `ధడక్` సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే అటు గ్లామర్‌పరంగా, ఇటు నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అందరూ జాన్విని శ్రీదేవితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీదేవి గతంలో చేసిన కొన్ని సినిమాలను మళ్లీ చేయమని అడుగుతున్నారు. తనను శ్రీదేవితో పోల్చడం గురించి జాన్వి అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది.

`మనుషులందరూ ఒకేలా ఉండలేరు. ప్రతీ వ్యక్తికీ ఓ ప్రత్యేక స్వభావం ఉంటుంది. కొంత మంది నాలో అమ్మను చూస్తున్నారు. అది సరికాదు. ఆమె వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు. నేను అమ్మలా ఉండలేను. అమ్మతో పోలిస్తే నా నటన వేరుగా ఉంటుంది. మరిన్ని ఎక్కువ సినిమాలు చేస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుందేమో` అంటూ జాన్వి వ్యాఖ్యానించింది.