కేసీఆర్ ద‌త్తపుత్రిక వివాహం

కేసీఆర్ ద‌త్తపుత్రిక వివాహం

తెలంగాణ సీఎం కేసీఆర్ ద‌త్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరపించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డలోని లూర్ధు మాత చర్చిలో ప్రత్యూష, చ‌ర‌ణ్ రెడ్డి పెళ్లి వేడుక కన్నులపండువగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్. షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌, జ‌డ్పీ వైస్ చైర్మన్ గ‌ణేష్‌, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజుతో పాలు పలువురు అధికారులు, బంధువులు హాజరై నూతన దంపతులను ఆశ్వీరదించారు.

క్రైస్తవ సంప్రదాయంలో వివాహ వేడుక నిర్వహించనున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యూష పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. గత అక్టోబర్ నెలలో చరణ్‌రెడ్డి, ప్రత్యూషల నిశ్చితార్థం విద్యానగర్‌లోని ఓ హోటల్ జరిగిన సంగతి తెలిసిందే. పెండ్లి వైభవంగా జరిపించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు ప్రత్యూష‌కు పెళ్లి కానుక‌గా సీఎం స‌తీమ‌ణి శోభ‌ బహుమతులు అందజేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజు ప్రత్యూష‌ను పెళ్లి కూతురుగా ముస్తాబు చేయగా… ఆ కార్యక్రమానికి హాజరైన సీఎం సతీమణి.. ప‌ట్టువ‌స్త్రాలు, వ‌జ్రాల నెక్లెస్ బ‌హుక‌రించారు.

సవతితల్లి చేతిలో చిత్ర హింసలకు గురైన ప్రత్యూష చావు అంచులకు చేరింది.. ఆమెకు అధికారులు విముక్తి కల్పించారు.. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన కేసీఆర్ దంపతులు.. ప్రత్యూషను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కోలుకున్న తర్వాత ఇంటికి పిలిచి ఆమెతో కలిసి భోజనం కూడా చేశారు.. ఆ తర్వాత చదువు, భవిష్యత్ బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఆమె కోరిక మేరకు నర్సింగ్‌కోర్సును పూర్తి చేయించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రత్యూష నర్సుగా పనిచేస్తోంది.