ఆ హీరోయిన్ సినిమా బాక్సాఫీస్ ఎదుట బోల్తా

ఆ హీరోయిన్ సినిమా బాక్సాఫీస్ ఎదుట బోల్తా

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి కీర్తి సురేష్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ భామ. అలనాటి అందాల తార సావిత్రి జీవితగాధ ఆధారంగా రూపొందిన ‘మహానటి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె మహానటి అనే టైటిల్‌తోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

అయితే ఈ ఏడాది నితిన్ హీరోగా నటించిన ‘రంగ్‌దే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్.అయితే ఈ సినిమా కాస్త బాక్సాఫీస్ ఎదుట బోల్తా పడింది. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మహేష్‌ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న కీర్తి. తమిళంలో హేశ్వరన్ దర్శకత్వంలో ‘సానికాయిధమ్’ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాలో సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి సినిమాలు థియేటర్‌లో విడుదల అవుతున్నప్పటికీ.. ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కీర్తి నటించిన ‘పెంగ్విన్’ అనే సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ సినిమాతో కీర్తికి మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది.