చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే

చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే

నటుడు రాజా రవీంద్ర మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి అభిమానో అందరికీ తెలిసిందే. తన ముక్కుసూటితనంతో రాజా రవీంద్ర చెప్పే నిర్ణయాలు అంటే చిరంజీవికి సైతం ఎంతో ఇష్టమట. అలా రాజా రవీంద్ర ఇండస్ట్రీలో ఎక్కువగా చిరంజీవితోనే కనిపిస్తుంటారు. రాజా రవీంద్ర ఈ మెగా బంధం ప్రత్యేకమైనది. అన్నయ్య అంటూ పిలిచే రాజా రవీంద్ర తాజాగా చిరు గుప్త సాయాల గురించి నోరు విప్పారు. క్రేజీ అంకుల్స్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ చిరంజీవి గొప్పదనం గురించి వివరించారు.

‘చిరంజీవి చేసే సహాయా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజంతా మాట్లాడినా సరిపోదు. కరోనా సమయంలోనూ ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఉన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ చేయించారు.. బ్లడ్ బ్యాంక్ వ్యవహారాలు చూసుకున్నారు.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు.. సీసీసీ పెట్టి అందరికీ నిత్యావసర సరుకులు అందించారు.బ్లడ్ బ్యాంక్ కదా? అని మనం ఈజీగా అనుకుంటాం.. కానీ దాని విలువ మనకు తెలియదు. దాని అవసరం ఉన్న వారికే బ్లడ్ విలువ తెలుస్తుంది. తలసేమియా వ్యాదిగ్రస్తులకు ప్రతీ నెలా రక్తం ఎక్కించాలి.

కరోనా వల్ల రక్తం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలోనూ అన్నయ్యే దగ్గరుండి అన్నింటిని చూసుకున్నారు.హేమకు డెలివరీ సమయంలో రక్తం కావాల్సి వచ్చింది. ఓ నెగెటివ్ బ్లడ్ రేర్‌గా ఉంటుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ఆమె బతికింది. ఆరోజు బ్లడ్ దొరికింది కాబట్టే ఆమె బతికింది. లేకపోతే చనిపోయేది. అలా రక్తం విలువ అవసరంలో ఉన్న వారికే తెలుస్తుంది. బ్లడ్ బ్యాంక్ నడపడం అంత సులేవీమీ కాదు. దానికి నెలకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది’ అని రాజా రవీంద్ర మెగా సేవల గురించి చెబుతూ చిరంజీవి సేవా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు.